Andhra Pradesh:ఆర్వోబీలతో మహార్ధశ

Another new ROB is going to be constructed in AP.

Andhra Pradesh:ఆర్వోబీలతో మహార్ధశ:ఏపీలో కొత్తగా మరో ఆర్‌వోబీ నిర్మాణం కానుంది. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలు ప్రాజెక్టులకు మోక్షం కలుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్‌‍లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తు్న్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.129.18 కోట్లతో మంగళగిరి ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ఆర్వోబీలతో మహార్ధశ

గుంటూరు, మార్చి 26
ఏపీలో కొత్తగా మరో ఆర్‌వోబీ నిర్మాణం కానుంది. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలు ప్రాజెక్టులకు మోక్షం కలుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్‌‍లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తు్న్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.129.18 కోట్లతో మంగళగిరి ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ మేరకు నిధులు మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే శాఖను ఇటీవల అభ్యర్థించారు. కేంద్ర మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ.. మంగళగిరిలో నాలుగు వరుసల ఆర్‌వోబీ నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేసింది.గుంటూరులోని గడ్డిపాడు వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సైతం రైల్వేశాఖ ఇటీవల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 107.79 కోట్లు మంజూరు చేసింది. రైల్వే గేటు కారణంగా ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో విజయవాడవైపు వెళ్లే వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్‌వోబీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. గుంటూరు-నంబూరు రైల్వేస్టేషన్ల మధ్య గడ్డిపాడు వద్ద నాలుగు వరుసలుగా దీనిని నిర్మిస్తారు. ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే పేరేచర్ల నుంచి విజయవాడ వెళ్లేవారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే హైదరాబాద్, నరసరావుపేట, పల్నాడు నుంచి వచ్చే భారీ వాహనాలను గుంటూరులోకి రాకుండా దారి మళ్లించేందుకు వీలవుతుంది.మరోవైపు గుంటూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు శంకర్ విలాస్ పైవంతెనతో పాటుగా ఆర్వోబీల నిర్మాణం చేపడతామని ఎన్నికల సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర సహాయ మంత్రి హోదాలో నిధుల మంజూరుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే గుంటూరు శంకర్‌విలాస్‌ ఫ్లైఓవర్‌కు ఇటీవల రూ. 98 కోట్లు మంజూరు చేయించారు.

Read more:Andhra Pradesh:అనంతలో అద్భుతం

Related posts

Leave a Comment